అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు మృతి !


J.SURENDER KUMAR,


సీనియర్ జర్నలిస్ట్ పాతూరి నర్సాగౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. అంత్యక్రియలు అయన స్వగ్రామం నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో రోజు జరిగాయి.

మెదక్ లో ప్రజాశక్తి, ఆంధ్రప్రభ విలేకరిగా అనేక సంవత్సరాలపాటు ఆయన పనిచేశారు. నర్సా గౌడ్ మరణం విషయం తెలుసుకొని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీ.జి.శ్రీనివాస్ శర్మ,, జర్నలిస్టుల సంక్షేమ కమిటీ సభ్యులు కంది శ్రీనివాస్ రెడ్డి తదితరులు నస్కల్ గ్రామానికి చేరుకొని అంత్యక్రియలో పాల్గొన్నారు.

అలాగే జర్నలిస్టుల ద్వారా విషయం తెలుసుకున్న లీల గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సహాయంగా ఆర్థిక సహాయం ఆయన కుమారులకు అందజే సారు.


అంత్యక్రియల్లో స్థానిక ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు బల్ల యాదగిరి, టీ యూడబ్ల్యుజ్ నాయకులు శ్రీధర్, చంద్రపు అమరేందర్ రెడ్డి,
పాతూరి రమేష్ గౌడ్, వూ డెం దేవరాజు, మద్దెల సత్యనారాయణ, కట్ట ప్రభాకర్, రాగి లింగం, రాధా కిషన్, రాజు, చంద్రం గౌడ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

కాగా జర్నలిస్టు నర్సా గౌడ్ మృతి పట్ల ఐజెయూ సభ్యులు బుక్క అశోక్, సోషల్ మీడియా కమిటీ సభ్యులు మిన్పూర్ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నాగరాజు సంతాపం తెలిపారు.