J.SURENDER KUMAR,
నిషేదిత సీపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన నలుగురు ఏరియా కమిటీ సభ్యులు ఒక దళసభ్యుడు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సిఆర్పిఎఫ్ అధికారుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు.
👉పోలీస్ అధికారులు తెలిపిన వివరాలు. ఇలా ఉన్నాయి !
👉 పూనెం పాక్షి, D/O కొవ్వల్, 27 సం, R/o పెద్దగెల్లూరు గ్రామం, తర్రెమ్ PS, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రం, పూనెం పాక్షి 2016 సంవత్సరంలో CNM సభ్యురాలిగా నిషేదిత సీపిఐ మావోయిస్ట్ పార్టీలో చేరి, 2018 సంవత్సరం లో ధళ సభ్యురాలిగా అనంతరం 2022 లో బాసగూడ LOS ఏరియా కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొంది అగ్రనాయకుల ఆదేశాల మేరకు పలు విధ్వంసకర ఘటనలలో పాల్గొన్నారు ఈమె పై ₹4 లక్షల రూపాయల రివార్డ్ ఉంది.
👉 వెట్టి దేవ @ బాలు, S/o దేవయ్య, 21 సం, గుత్తికోయ, R/O ఎర్రంపాడు గ్రామం, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ వెట్టి దేవ @ బాలు 2018 సంవత్సరంలో నిషేదిత సీపిఐ మావోయిస్ట్ పార్టీలో సభ్యుడిగా చేరినాడు. 2019 నుండి 2022 వరకు చర్ల LOS లో మిలిషియా సభ్యుడిగా పని చేస్తూ పార్టీ నాయకుల ఆదేశాలతో భద్రతా బలగాలపై ఎన్నో దాడులకు పాల్పడ్డాడు. అనంతరం ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది అగ్ర నాయకుల ఆదేశాల మేరకు 2022 ఆగస్ట్ లో కుర్నపల్లిలో ఇర్ప రాముడు ను హత్యచేసిన ఘటనలో, 2023 ఫిబ్రవరిలో కుంజర్ అంబుష్ (CG) దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో 2024 ఆగస్ట్ లో చెన్నాపురంలో నీల్సో @ రాధా ను హత్యచేసిన ఘటనల్లో కీలకంగా వ్యవహరించాడు. ఇతనిపై ₹4 లక్షల రూపాయల రివార్డ్ ఉంది.
👉 మడకం ఉంగి @ గంగి, W/o వెట్టి బాలు, @ దేవ (ACM, చర్ల ప్లాటూన్), 22 సం, R/o. చెన్నాపురం గ్రామం, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. వెట్టి దేవ @ బాలు 2018 సంవత్సరంలో నిషేదిత సీపిఐ మావోయిస్ట్ పార్టీలో సభ్యుడిగా చేరినాడు. 2019 నుండి 2022 వరకు చర్ల LOS లో మిలిషియా సభ్యుడిగా పని చేస్తూ పార్టీ నాయకుల ఆదేశాలతో భద్రతా బలగాలపై ఎన్నో దాడులకు పాల్పడ్డాడు. అనంతరం ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది అగ్ర నాయకుల ఆదేశాల మేరకు 2022 ఆగస్ట్ లో కుర్నపల్లిలో ఇర్ప రాముడు ను హత్యచేసిన ఘటనలో, 2023 ఫిబ్రవరిలో కుంజర్ అంబుష్ (CG) దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో 2024 ఆగస్ట్ లో చెన్నాపురంలో నీల్సో @ రాధా ను హత్యచేసిన ఘటనల్లో కీలకంగా వ్యవహరించాడు. ఇతనిపై ₹4 లక్షల రూపాయల రివార్డ్ ఉంది.
👉 రవ్వ సోమ S/o సూల, 25 సం, Rio ఇర్రపల్లి గ్రామం, పామేదు PS, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం, రవ్వ సోమ 2010 సంవత్సరం లో బాలల సంఘంలో సభ్యుడిగా పార్టీలో చేరి, అనంతరం 2017 నుండి 2021 వరకు ధళ సభ్యుడిగా పామేడ్ ఏరియా,సౌత్ బస్తర్ DVC లో పనిచేసి చత్తీస్ఘడ్లో అనేక విధ్వంసకర ఘటనలలో పాల్గొన్నాడు. అనంతరం 2023 లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది ఇప్పుడు పామేడ్ ఏరియా Instructor గా పని చేస్తున్నాడు. ఇతనిపై ₹4 లక్షల రూపాయల రివార్డ్ ఉంది.
👉 మడివి గంగి D/o మసల్, 23 సంవత్సరాలు, R/o. రాసపల్లి, పామేడ్ PS, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రం, మడివి గంగి 2018 లో బాలల్ సంఘం లో చేరి, 2019లో ఎర్రపల్లి RPC లో మిలిషియా సభ్యురాలిగా అనంతరం పామేడ్ LOS లో ధళ సభ్యురాలిగా భద్రతా బలగాలపై ఎన్నో దాడులలో పాల్గొనడం జరిగింది. ఈమెపై ₹ 1 లక్ష రూపాయల రివార్డ్ ఉంది.
తెలంగాణ ప్రభుత్వం తరపున జిల్లా పోలీసులు కల్పిస్తున్న సౌకర్యాలను గ్రహించి జనజీవన స్రవంతిలో కలిసి మెరుగైన జీవితం గడపాలని నిశ్చయించుకొని తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు తమపై చూపుతున్న వివక్షను గ్రహించి పూనెం పాక్షి, వెట్టి దేవ, మడకం ఉంగి, రవ్వ సోమ మరియు మడివి గంగి మావోయిస్ట్ పార్టీని వీడి లొంగినట్టు పోలీసుల తెలిపారు.
లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే దళ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా గానీ, స్వయంగా గానీ తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో లేదా జిల్లా ఉన్నతాధికారుల దగ్గరలోని పోవడానికి పోలీసులు విజ్ఞప్తి చేశారు.