ఇందిరమ్మ ఇళ్ల సర్వే ను పరిశీలించిన కలెక్టర్ సత్య ప్రసాద్ !

J.SURENDER KUMAR,


జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే లో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.


శనివారం పెగడపెల్లి మండల కేంద్రంలో పలు వార్డు లలో ఇళ్లులేని నిరు పేదలు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా సర్వే సిబ్బంది చేస్తున్న ఇంటింటి సర్వేను తనిఖీ చేశారు.
యాప్ ద్వారా సర్వే చేపట్టాలని సూచించారు.


ఇందిరమ్మ పథకం కింద పూర్తిస్థాయి అర్హత గల నిరుపేద కుటుంబాలను గుర్తించి ఇండ్లు మంజూరు చేస్తాను అన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలో సర్వే చేసిన సరళిని పరిశీలించారు.


అనంతరం లబ్ధిదారులు యొక్క వివరాలను యాప్ ద్వారా పొందుపరుస్తున్న వివరాల నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించి.


కలెక్టర్ దగ్గర ఉండి వివరాలను నమోదు చేయించారు.
కలెక్టర్ వెంట డిపిఓ రఘు వరుణ్ , తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.