J.SURENDER KUMAR,
రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్న చీరల నమూనాలను మంగళవారం అసెంబ్లీలోని తన చాంబర్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పరిశీలించారు.
👉 మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర చేనేత సహకార సంఘం (TGSCO) ద్వారా తయారు చేయించి ఏడాదికి రెండు చీరల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించగా, వాటి నమూనాలను సీఎం పరిశీలించారు.
👉 ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి సీతక్క , పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు.