తెలంగాణకు కేంద్రీయ విద్యాల‌యాలు కేటాయించండి!

👉 కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి !


J.SURENDER KUMAR,


తెలంగాణకు కేంద్రీయ విద్యాల‌యాలు కేటాయించాల‌ని గురువారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ని కలిసి ఇటీవ‌ల రాష్ట్రానికి ఏడు న‌వోద‌య విద్యాల‌యాలు కేటాయించినందుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు.


👉 అదే స‌మ‌యంలో రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాల‌యం కూడా కేటాయించ‌లేద‌ని, కేంద్రియ విద్యాల‌యాల‌తో పాటు నవోద‌య పాఠ‌శాల‌లు లేని జిల్లాల‌కు వాటిని కేటాయించాల‌ని ముఖ్య‌మంత్రి గారు కోరారు. డీమ్డ్ యూనివ‌ర్సిటీల ప్రకటనకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అని, కానీ ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వ అనుమ‌తితోనే డీమ్డ్ యూనివ‌ర్సిటీలను గుర్తిస్తున్న విషయాన్ని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డీమ్డ్ యూనివ‌ర్సిటీ గుర్తింపున‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి విధిగా ఎన్ఓసీ తీసుకునేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు.


👉 కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ముఖ్యమంత్రి తో పాటు పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ , సురేష్ షేట్కర్ , పోరిక బలరాం నాయక్ , చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ, రాయసాయం రఘురామిరెడ్డి న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు.