థాయిలాండ్ లో తెలంగాణ వాసులు తప్పిపోయారు !

👉 భర్తల ఆచూకీ కోసం భార్యల వినతి !


J.SURENDER KUMAR,


ఎజెంటుకు ₹.2 లక్షల చొప్పున చెల్లించి విజిట్ వీసాపై ఉద్యోగం కోసం థాయిలాండ్ కు వెళ్లిన ఇద్దరు తెలంగాణ వాసులు అక్కడ తప్పిపోయిన సంఘటన ఇది.
వివరాలు ఇలా ఉన్నాయి..


నిజామాబాద్ జిల్లా షెట్పల్లి కి చెందిన శనిగరపు అరవింద్, జగిత్యాల జిల్లా ఆత్మకూరు కు చెందిన కొండ సాగర్ నవంబర్ 11న ముంబయి నుంచి బ్యాంకాక్ కు వెళ్లారని నవంబర్ 21 నుంచి అందుబాటులో లేకుండా పోయారని అరవింద్ భార్య జల, సాగర్ భార్య కాశమ్మ మంగళవారం హైదరాబాద్ లోని ప్రవాసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

అరవింద్ (ఫైల్ ఫోటో)


వారివెంట కాంగ్రేస్ ఎన్నారై సెల్ నాయకులు డా. బిఎం వినోద్ కుమార్, మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు ఉన్నారు. 

సాగర్ (ఫైల్ ఫోటో)


థాయిలాండ్ లో తప్పిపోయిన ఇద్దరి ఆచూకీ తెలుసుకోవాలని, ఏజెంట్ పై పోలీసు కేసు నమోదు చేయాలని వారు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.