👉విడుదల చేసిన ప్రకటనలో..
👉ఏటూర్ నాగారం ఎన్కౌంటర్ కు నిరసనగా !
👉ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఎన్కౌంటర్..
J.SURENDER KUMAR,
డిసెంబర్ 1 న ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల 9న రాష్ట్రవ్యాప్త బందు కు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు ఇస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
👉ప్రకటనలు వివరాలు ఇలా ఉన్నాయి..
కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యకాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త బంద్ కు ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. . యావత్ పీడత ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యాలయాలు, తదితర వ్యాపార సంస్థలు బందును పాటించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత వహించాలి. అని పేర్కొంది.
👉ప్రకటనలో ఇలా పేర్కొన్నారు..

ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా, ఏటూర్ నాగారం మండలం, చల్పాక గ్రామ పంచాయితీ అడవుల్లో పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతంగా చంపారు. అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 30వ తేదీ సాయంత్రం ఏడుగురితో వున్న మా దళం చల్చాక పంచాయితీలో వున్న వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు. అని ప్రకటనలో వివరించారు. ముందుగానే పోలీసులకు అప్రోవర్ గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృహం కోల్పోయే లాగా చేశారు.
స్పృహా కోల్పోయిన కామ్రేడ్స్ ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుఝామున 4 గంటలకు అతి సమీపం నుండి కాల్చి చంపారు. శతృవు మోస పూరిత పథకంలో చిక్కి అమూల్యమైన కామ్రేడ్స్ కురుసం మంగు @ పాపన్న, బద్రు (తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు), ఏగోలపు మల్లయ్య @(మధు, కోటి జెఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ సభ్బుడు), ముచాకీ అండాల్ @ కరుణాకర్ (ఇల్లెందు నర్సంపేట్ ఏరియా కమిటి సభ్యుడు), ముచాకీ బూమే@ జమున (ఏరియా కమిటీ సభ్యురాలు), పూనెం చోటు @కిశోర్( రీజినల్ కంపెనీ-2 మొదటి ప్లటూన్ పార్టీ కమిటి సభ్యుడు), కర్టం కామాల్ (రీజినల్ కంపెనీ-2లోని రెండవ ప్లటూన్ సభ్యుడు), కా. జైసింగ్ (ఏటూర్ నాగారం- మహదేవ్ పూర్ ఏరియా దళం సభ్యుడు)లు ప్రాణాలర్పించారు.
ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరులకు జోహార్లు అంటూ ఆ పార్టీ అధికార ప్రతిదీ జగన్ పేరుతో విడుదలైన ప్రకటనలో పేర్కొనబడింది.