👉 ₹192 కోట్ల తో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన !
J.SURENDER KUMAR,
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్పల్లి ఏడు పాయ ల దుర్గా భవాని అమ్మవారిని మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ అర్చకులు ముఖ్యమంత్రి కి ఆశీర్వచనం అందించారు. అనంతరం జిల్లాకు సంబంధించి ₹192 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

మెదక్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలను కలుపుతూ ₹ 52.76 కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం, ₹ 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణం, జిల్లా స్వయం సహాయ మహిళా సంఘాలకు ₹ 100 కోట్లతో బ్యాంక్ లింకేజీ చెక్ అందజేత, ₹ 35 కోట్లతో ఏడుపాయల వద్ద రోడ్డు విస్తరణ, డివైడర్ నిర్మాణం పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ఎంపీలు రఘునందన్ రావు , సురేష్ కుమార్ షెట్కర్ , ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ , ఎమ్మెల్యే రోహిత్ రావు తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.