👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గత బీఆర్ఎస్ పాలకుల నిర్వాకం తోనే రైతాంగానికి ప్రస్తుతం సాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్ లో నీటి సామర్థ్యం ఉండాల్సిన స్థాయి కంటే నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, పంటల సాగుకు ఇబ్బంది కలుగుతుందని రైతులు బుధవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి మొరపెట్టుకున్నారు.
స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులు రైతులతో కలిసి రిజర్వాయర్ ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ధర్మారం మండలంలోని మేడారం చెరువుకు గొప్ప చరిత్ర ఉందని, గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో ఈ చెరువును రిజర్వాయర్ గా మార్చి పైప్ లైన్ ద్వారా సిరిసిల్ల, సిద్దిపేటకు అప్పటి మంత్రి హరీష్ రావు నీటిని తరలించాడని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇంతటి నీటి దోపిడీ జరుగుతున్న ఈ ప్రాంత బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేయక మౌనం వహించారన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి నీటి అవసరం ఎంత ఉంది ? , నీటీ వాట ఎంత ? అనే విషయం గత పాలకులు పట్టించుకోలేదన్నారు.
వారి నిర్వాకం వలన ధర్మపురి పట్టణ ఒడ్డున గోదావరి నది ఉన్న, ధర్మారం మండలంలో మేడారం రిజర్వాయర్ ఉన్న ఈ రైతంగానికి సాగు నీరు అందించే విషయంలో గత పాలకులు పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు.

సాగునీటి గూర్చి నేను స్వయంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వారు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన గోదావరిలో ఒక టీఏంసి నీటినీ విడుదల చేశారని, ఈరోజు మేడారం రిజర్వాయర్ లోకి నీటితో నింపడం జరుగుతుందన్నారు.
,త్వరలోనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ధర్మపురి నియోజకవర్గంలో పర్యటన ఉంటుందని, వారి ఆధ్వర్యంలో ఈ ప్రాంత ఇరిగేషన్ పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి సాగు నీటి విషయంలో శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.