J.SURENDER KUMAR,
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో పాల్గొనడానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలుసుకున్నారు.

జ్యూరిచ్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరస్పరం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై వారి మధ్య క్లుప్తంగా చర్చ జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు , ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కూడా ఉన్నారు.

దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. .
ముఖ్యమంత్రి , మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం జ్యూరిచ్ విమానాశ్రయం చేరుకోగానే అక్కడ స్థిరపడిన తెలుగు వారితో సందడి నెలకొంది. ముఖ్యమంత్రి కి పెద్ద ఎత్తున హాజరై అభినందనలు తెలియజేశారు.

. దావోస్ సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్య స్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో ఈ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది.