ఖిల్లా ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాం మంత్రి శ్రీధర్ బాబు !


J.SURENDER KUMAR,


రామగిరి ఖిల్లా ను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తాం అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
రామగిరి. ముత్తారం, కమాన్ పూర్ మండలాల్లో ఆదివారం పర్యటించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ మాట్లాడుతూ..


👉ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామగిరి ఖిల్లా ను అభివృద్ధి చేయడం కొరకు ముఖ్యమంత్రి మన జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది, అన్నారు.


👉బేగంపేట, రత్నాపూర్ గ్రామాల నుండి రామగిరి ఖిల్లా కు ఇరువైపులా రోడ్లు అభివృద్ధి చేయడం కొరకు, రామగిరి ఖిల్లా పై మౌలిక వసతులు కల్పించడం కొరకు ఈ నిధులను కేటాయించినట్లు తెలిపారు.


👉రామగిరి ఖిల్లా పై ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయని, శ్రీరాముడు నడిచిన నేల గా ప్రసిద్ధి అని ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని అన్ని హంగులతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రామగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం కొరకు ప్రణాళికలు సిద్ధం చేసి నిధులు మంజూరు కొరకు కృషి చేస్తామని తెలిపారు.