J.SURENDER KUMAR,
నేరేళ్ల గ్రామపంచాయతీ ఆవరణలో గోవింధుపల్లె రైతుల సమావేశం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు కు సంతకాల సేకరణ చేపట్టారు.
ప్రభుత్వం నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలఏర్పాటు లో భాగంగా నేరెళ్ళ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ( సింగిల్ విండో )ఏర్పాటు కోసం ఆదివారం రైతులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు
1968 నుండి 2004 వరకు నేరేళ్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకారం ఉండేది ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో సిబ్బంది కొరత వలన విలీనం చేశారు దీనిని దృష్టిలో ఉంచుకుని తిరిగి నేరెళ్ల లో సహకార సంఘం ఏర్పాటు చేస్తే చుట్టు పక్క గ్రామాల రైతులకు సౌకర్యార్థం గా ఉంటుంది తీర్మానించారు.
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టర్, సహకార అధికారి వినతిపత్రం ఇవ్వాలని తీర్మానించారు.
ఈ సమావేశంలో సహకార సంఘం వైస్ చైర్మన్ శేర్ల రాజేశం, డైరెక్టర్ జాజాల లక్ష్మీ వెంకన్న, తాజా మాజీ ఎంపీటీసీ సభ్యులు రెడ్డవేని సత్యం, కాంగ్రెస్ పార్టీ నేరెళ్ళ అధ్యక్షుడు కసారాపు బలగౌడ్ , గోవిందుపల్లే అధ్యక్షుడు పురంశెట్టి మల్లేశం, తాజా మాజీ ఉపసర్పంచ్ లు జాజాల శేంకర్, జిళ్ళ మల్లేశం , నాయకులు పోతరాజు లింగారెడ్డి , పాల గణేష్, ఉడుత గంగారాం పలిగిరి లచన్న, జంగిలి తిరుపతి, పాదం శంకర్, చిన్న మినయ్య, జాజాల రవీందర్ ,కసరాపు సాంబయ్య, కరువత్తుల నాగరాజు , ఇరగదిండ్ల వేణు, ఈదునురి బక్కయ్య, కోదురుపాక మల్లేశం, వేముల మల్లేశం, మామిడిపెల్లి రాజయ్య, గోపాల్ గొర్రె నరేష్, మడిశెట్టి లక్ష్మణ్, వడ్ల లచ్చన్న వివిధ కుల సంఘాల నేతలు రైతులు పాల్గొన్నారు