👉 యుద్ధ ప్రాతిపదికన ఒక టిఎంసి నీటికి గోదావరిలోకి విడుదల చేయండి !
👉 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన ధర్మపురి ఎమ్మెల్యే !
J.SURENDER KUMAR,
యుద్ధ ప్రాతిపదికన గోదావరి నదిలోకి ఒక టీఎంసీ నీటిని వదిలి పంటలను కాపాడండి అంటూ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం హైదరాబాదులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.
ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గ పరిధిలో గోదావరి నది లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దాదాపు 25 వేల ఎకరాలకు పైగా ఆయకట్ట సాగు అవుతున్నది. కొన్ని పరిస్థితుల కారణంగా గోదావరిలో నీరు లేక సాగుకు ఇబ్బంది కలుగుతుందని రైతులు గురువారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివరించి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లక్ష్మణ్ కుమార్, జీవన్ రెడ్డిలు రైతులతో కలిసి గురువారం గోదావరి నది తీరంను, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించారు.

రైతులు ఆందోళన చెందకుండా పంటలను కాపాడడం కోసం శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్ వెళ్లి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ మర్యాద పూర్వకంగా కలిసి రైతుల పంటల పరిస్థితి వివరించారు, గోదావరిలో ఒక టిఎంసి నీటికి విడుదల చేయాలనీ కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
గోదావరి నది పైన సదర్ఘాట్ వద్ద గేట్ల నిర్మాణం చేపట్టడంతో ధర్మపురి మరియు జగిత్యాల నియోజకవర్గాల ప్రాంతాలకు గోదావరి నదిలో నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గెట్లతో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల మా ప్రాంతంలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నీరు అందక 16 గ్రామాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల భూమినీ సాగు చేసుకోలేక రైతులు కష్టపడుతున్నారని అన్నారు.

క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి స్వయంగా సమీక్షించి ఒక టిఎంసి నీటికి గోదావరి నదిలో విడుదల చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే వివరించారు.