👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రాజకీయ పార్టీలకు అతీతంగా, ప్రజా పాలన ప్రభుత్వంలో నా నియోజకవర్గంలో లబ్ధిదారులకు, వివక్షత లేకుండా ఆగస్టు మాసం నుండి డిసెంబర్ వరకు ₹ 20, 04, 69, 312/- ( ఇరువది కోట్ల నాలుగు లక్షల ఆరువది తొమ్మిది వేల మూడు వందల పన్నెండు రూపాయలు) మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వారికి ఆర్థిక చేయూత అందించానని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం కళ్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

నా నియోజకవర్గానికి సంబంధించి ఆగస్టు మా సం నుంచి డిసెంబర్ మాసం వరకు 3706 మంది సీఎంఆర్ లబ్ధిదారులకు ₹ 8 కోట్ల, 35 లక్షల, 25 వేల 5 వందల రూపాయల విలువ గల చెక్కులు పంపిణీ చేశామన్నారు.
85 మంది LOC లబ్ధిదారులకు ₹ 1 కోటి 59 లక్షల 25 వేల రూపాయల విలువగల ఆర్థిక సహాయం అందించామన్నారు.
1061 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ₹ 10 కోట్ల 10 లక్షల 18 వేల 812 రూపాయల విలువ గల చెక్కులు అందించామని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వివరించారు.
ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు.
👉 ఈ నెల 26 నుండి..

ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల జారి, పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ లో గ్రామ సభలను ఏర్పాటు చేసి అర్హులైన లబ్దిదారులకు మాత్రమే ఇళ్లను పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ₹ 75 లక్షల రూపాయల విలువగల 75 కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 82 మంది లబ్ధిదారులకు (CMRF ) ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ₹ 24 లక్షల 11 వేల 5 వందల రూపాయల విలువ గల చెక్కులను పంపిణి చేసారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు