పోలవరం తో భద్రాచలం కు నష్టం పై నివేదిక ఇవ్వండి !

👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


పోలవరం నిర్మాణంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయానికి ఏర్ప‌డే ముప్పు పై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

👉పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తెలంగాణ రాష్ట్రంపై పడే ప్రభావాన్ని హైదరాబాద్ ఐఐటీకి చెందిన బృందంతో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

👉ఐఐటీ బృందంతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించి నెల రోజుల్లో సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయించాలని చెప్పారు.

👉 ముఖ్యమంత్రి అధ్యక్షతన నీటి పారుదల శాఖపై సమావేశంలో పరిస్థితిని శనివారం సమీక్షించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , నీటి పారుదల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌ల తో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

👉 2022లో 27 లక్షల క్యూసెక్‌ల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు అధికారులు వివరించారు.

👉ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB)తో పాటు కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

👉 వరద జలాల ఆధారంగా బనకచర్ల నిర్మిస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందనీ, ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు వివరించినప్పుడు తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాలను తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.