రేషన్ కార్డుల ద్వారా ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల సన్నబియ్యం !

👉మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి !

👉 ధర్మపురి మండలం జైన గ్రామ సభలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ !


J.SURENDER KUMAR,


రాష్ట్రంలోనే చివరి లబ్ధిదారుడి రేషన్ కార్డు వరకు ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల సన్నబియ్యం అందిస్తాం, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని నీటిపారుదల ,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.


బుధవారం నీటి పారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎంఎల్ సి జీవన్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణ, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ లతో కలిసి ధర్మపురి మండలలోని జైన గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు.


👉ఈ సందర్భంగా మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ
,

👉రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా అవుతున్నాయని, వీటిని చాలా మంది తినడం లేదని, నూతన రేషన్ కార్డుల జారీ తరువాత ప్రతి ఒక్కరికి 6 కీలోల నాణ్యమైన సన్న బియ్యం రేషన్ కార్డుల ద్వారా సరఫరా చేస్తామని అన్నారు.

👉 మహిళలకు, రైతులకు, రైతు కూలీలకు, నిరుద్యోగులకు , పేదలకు ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో మేలు చేయలేదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, గత 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఈ స్థాయిలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, కేవలం 40 వేల కార్డులు మాత్రం అందించారని అన్నారు.


👉జనవరి 26 నాడు ప్రారంభించి రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డు వచ్చే వరకు ప్రక్రియ కొనసాగుతుందని, రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, ప్రజా పాలన కేంద్రాలలో దరఖాస్తు చేసిన, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసినా, గ్రామ సభలలో దరఖాస్తు ఇచ్చిన విచారించి అర్హత మేరకు కార్డులు మంజూరు చేస్తామని అన్నారు.


👉గ్రామ సభలో ప్రకటించే ప్రాథమిక జాబితాలో పేరు లేని పక్షంలో దరఖాస్తు సమర్పిస్తే అర్హతను పరిశీలించి రేషన్ కార్డు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు మండల కేంద్రాలు మున్సిపాలిటీలలో ఉన్న ప్రజాపాలన కేంద్రాలలో కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని మంత్రి పేర్కొన్నారు.


👉 ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో సాచురేషన్ పద్దతిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మించామని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభిస్తున్నామని, 100 శాతం ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు.


👉ప్రస్తుతం సొంత జాగా ఉండి ఇండ్లు లేని వారికి ₹ 5 లక్షల రూపాయలు అందిస్తున్నామని, ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి ₹ 6 లక్షల సహాయం అందజేయ బోతున్నామని అన్నారు. రైతు భరోసా కింద రైతులకు అందే సహాయం 20 శాతం పెంచి ఎకరానికి ₹12 వేల రూపాయలు అందజేస్తామని, వ్యవసాయ యోగ్యమైన భూమికి పంట వేసిన వేయకుండా రైతు భరోసా అందుతుందని అన్నారు.


👉భూమిలేని కూలీలకు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు కూలీల కుటుంబాలకు ₹12 వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. ఈ నాలుగు పథకాలను గ్రామసభలు నిర్వహించే ప్రజల సమక్షంలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి జనవరి 26 నుంచి అమలు చేస్తామని, అర్హులైన చివరి వ్యక్తి వరకు లబ్ధి జరుగుతుందని అన్నారు.


👉 మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,

గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని, గ్రామ సభలలో ప్రతిపక్ష పార్టీ నాయకులు అవసరమైన సలహాలు సూచనలు అందించాలని కోరారు. జనవరి 26 నుంచి ప్రారంభించి అర్హత ప్రకారం రేషన్ కార్డులను అందరికీ జారీ చేస్తామని అన్నారు.


👉ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ


అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి రేషన్ కార్డు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా సంవత్సరానికి ₹12000/- రూపాయలు జనవరి 26 వ తారీకు నుండి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభిస్తుందని తెలిపారు. ధర్మపురిలో గోదావరి నది ఒడ్డుకు వున్న రైతులకు సాగు నీరు అందడం లేదని. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట పైన చెక్ డ్యాములు నిర్మాణం చేపడితే జైన గ్రామంతో పాటు బీర్పూర్ మండలాల రైతులకు మేలు చేకూరుతుందని తెలిపారు.


ఈ సమావేశంలో ,జిల్లా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఎస్పీ, అశోక్ కుమార్, ఏఎస్పీ భీమ్ కుమార్ , ఆర్డీవో మధు సుధను, డీఆర్డీఓ రఘు వరుణ్, డిపిఓ , మధన్ మోహన్, ఎమ్మార్వో, కృష్ణ చైతన్య , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.