సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ లో సీఎం రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  అక్కడి తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి  వెంట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్యే కుందూరు జయవీర్ , హైదరాబాద్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ రోహిణ్ రెడ్డి ఉన్నారు.


సింగపూర్ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్చరల్ సొసైటీ ( సింగపూర్ ) అధ్యక్షుడు గడప రమేశ్ బాబు , సొసైటీ కార్యవర్గంతో పాటు పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు.


👉సింగపూర్‌ పర్యావరణ శాఖ మంత్రి తో సమావేశం !


సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాల పై ఈ సమావేశంలో ఇరుపక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి.


ముఖ్యంగా పట్టణాభివృద్ధి ప్రణాళిలు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరులు – నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్లు, తయారీ, పర్యావరణం, స్థిరత్వ, సాంకేతికత సహా వివిధ రంగాలలో తెలంగాణలో  పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భాగస్వామ్యాల పై చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి.


ఈ చర్చల్లో ముఖ్యమంత్రి  వెంట ఐటీ & పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , రాష్ట్రానికి చెందిన  ఉన్నతాధికారులు, సింగపూర్‌లో భారత డిప్యూటీ హై కమిషనర్ పూజ ఎం.టిల్లు  పాల్గొన్నారు. Telangana Rising లక్ష్యాలు, ఆ మేరకు ప్రజా ప్రభుత్వం అనురిస్తున్న కార్యాచరణ పట్ల సింగపూర్ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్  ఆసక్తి కనబరిచారు.


ప్రధానంగా నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి నిర్వహణ, స్థిరత్వ ప్రణాళికల్లో తెలంగాణతో భాగస్వామ్యం అంశాన్ని సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని వారు హామీ ఇచ్చారు. ఉమ్మడి ప్రాజెక్టులపై సాధ్యమైనంత వేగంగా ముందుకు పోవాలని, మరింత సమన్వయంతో పని కలిసి చేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.