J.SURENDER KUMAR,
తిరుమల శ్రీవారి దర్శన నిమిత్తం భక్తుల కోసం టీటీడీ దేవస్థానం ఆన్లైన్ టికెట్ల విడుదల వివరాలు విడుదల చేసింది.
👉ఏప్రిల్ కోటా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఆర్జిత సేవా టిక్కెట్లను జనవరి 18 ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.
👉ఈ సేవా టిక్కెట్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 18 నుండి 20 వరకు ఉదయం 10 గంటల వరకు జరుగుతుంది.
👉ఈ టికెట్లు పొందిన వారు జనవరి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నాం 12 గంటల లోపు మొత్తాన్ని చెల్లిస్తే లక్కీ డిప్ ద్వారా టిక్కెట్లు కేటాయిస్తారు.
👉ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జరిగే శ్రీవారి సాలకట్ల వసంతోత్సవానికి సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టిక్కెట్లు, ఆర్జిత సేవా టిక్కెట్లను జనవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
👉జనవరి 21 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవాలు మరియు వారి దర్శన స్లాట్ల కోసం ఏప్రిల్ కోటాను TTD ఆన్లైన్లో విడుదల చేస్తుంది.
👉జనవరి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లను ఆన్లైన్లో టిటిడి విడుదల చేయగా, అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లను విడుదల చేస్తుంది.
👉వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేక దర్శనం టోకెన్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
👉టీటీడీ ₹.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను జనవరి 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
👉జనవరి 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతిలో వసతి ఆన్లైన్లో విడుదల చేయబడుతుంది.
👉జనవరి 27న శ్రీవారి సేవ సాధారణ, నవనీత, పరకామణి వరుసగా ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, మధ్యాహ్నం 1 గంటలకు విడుదల చేస్తారు.
.