J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు రాపర్తి విజయలక్ష్మికీ తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతి లో సావిత్రిబాయి పూలే అవార్డు ను శుక్రవారం రాత్రి ప్రధానం చేశారు.
బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మరియు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ బి. మని మంజరి ఆధ్వర్యంలో ఆమె జయంతి ఉత్సవాలలో భాగంగా సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న ప్రముఖులను అవార్డులతో సత్కరించారు,

ఈ అవార్డులో రాపర్తి విజయలక్ష్మి ని విద్యా రంగంలో, సామాజిక రంగంలో చేసిన సేవలకు గాను రాష్ట్రస్థాయి మహిళ ప్రతిభ పురస్కారం అవార్డుతో సత్కరించారు.