👉 సీఎం రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి !
J.SURENDER KUMAR,
నవోదయ విద్యాలయాన్ని మార్పు చేయకుండా నేరెల్ల లోనే ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వని కి లేఖ రాయాల్సిందిగా సిఎం రేవంత్ రెడ్డిని ధర్మపురి ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు.
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం కరీంనగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ , రేవంత్ రెడ్డి తో నియోజకవర్గ సాగునీటి ప్రాజెక్ట్ ల అంశంతో పాటు , నియోజకవర్గంలోని నేరేల్ల వద్ద కేటాయించిన నవోదయ విద్యాలయాన్ని తరలించకుండా నెరెళ్ళ లోనే ఉంచే విధంగా మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ పక్షాన లేఖ రాయాల్సిందిగా కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సామకూలంగా స్పందించారు