J.SURENDER KUMAR,
రాష్ట్రంలో మొదటి విడతగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
నారాయణపేట జిల్లా అప్పకపల్లి గ్రామంలో దళిత మహిళ బంగలి దేవమ్మ ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు. ఇండ్ల నిర్మాణానికి పత్రాలు అందుకున్న గ్రామ మహిళలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ని కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , మంత్రులు దామోదర రాజనర్సింహ , జూపల్లి కృష్ణారావు , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , లోక్ సభ సభ్యురాలు డీకే అరుణ తో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.