మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి!

👉 క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ సీఎం కార్యాలయానికి ఫోన్ !


J.SURENDER KUMAR,


మధ్యప్రదేశ్‌లోని జబల్​పూర్​ సమీపంలో (నాగపూర్ – ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై) మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలతో పాటు అన్ని రకాల సహకారం అందించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు సీఎం ఫోన్ చేశారు.


ఈ దుర్ఘటనలో హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందటంతో వెంటనే తెలంగాణ సీఎంఓ అధికారులను అప్రమత్తం చేశారు. 
వివరాలు ఇలా  ఉన్నాయి


ప్రయాగ్‌రాజ్‌లో జరుగు తోన్న మహాకుంభమేళాకు వెళ్లి వస్తోన్న యాత్రికుల మినీ బస్సు, ఓ ట్రక్కును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. జబల్బూర్ సమీపంలోని సిహోరో వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిని తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.


నాచారానికి చెందిన 25 మంది కుంభమేళాకు మినీ బస్సులో వెళ్లి.. పుణ్యస్నానం చేసి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్య లు చేపట్టారు. క్షతగాత్రుల ను చికిత్స కోసం ఆసుప త్రికి తరలించారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జబల్‌పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సెనా, ఎస్పీ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు., ఈరోజు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది.


తెలుగు రాష్ట్రానికి చెందిన భక్తులు ప్రయాణిస్తోన్న మినీ బస్సు.. సిరోహ పట్టణం వద్ద వంతెనపై ట్రక్కు ను ఢీకొట్టిందని జబల్‌పూర్ కలెకట్ర్ దీపక్ కుమార్ సక్సెనా తెలిపారు.
ఘటనా స్థలిలోనే ఏడుగు రు చనిపోయారని, మరో 16 మంది గాయపడ్డారని చెప్పారు. జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో ట్రక్కు రావడంతో ప్రమాదం జరిగినట్టు వివరించారు.


క్షతగాత్రులను చికిత్స కోసం సిరోహి ఆసుపత్రికి తరలిం చామని, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన అన్నారు. మెరుగైన వైద్యం కోసం జబల్‌‌‌పూర్‌కి తరలించినట్టు పేర్కొన్నా రు. ప్రమాద తీవ్రతకు మినీ బస్సు నుజ్జునుజ్జయ్యింది.