మైనర్ బాలిక పై అత్యాచారం దోషికి 20 సంవత్సరాల జైలు శిక్ష !

👉 బాధిత బాలికకు ₹ 2 లక్షల పరిహారం. !

👉 న్యాయమూర్తి శ్రీమతి నీలిమ సంచలన తీర్పు !


J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన మైనర్, మానసిక వికలాంగురాలైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ దోషి చెట్పల్లి నారాయణ @ టోపీ నారాయణ వయస్సు 55 సంవత్సరాలు అనే వ్యక్తికి 20 సంవత్సరాల కఠిన కరాగర శిక్ష, వేయి రూపాయల జరిమాన బాధిత మహిళకు ₹ రెండు లక్షల నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి శ్రీమతి నీలిమ సంచలన తీర్పు ఇచ్చారు.


పోక్సో చట్టం కింద మల్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా మల్యాల సిఐ రమణమూర్తి కేసును విచారించడం జరిగింది. Fast track spl. Court కి ఆధారాలు సమర్పించగా పిపి కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షలను ప్రవేశపెట్టగా సాక్షులను విచారించారు.


ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ … సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ వేగవంతగా జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని అన్నారు .

పై కేస్ లో నిందితునికి శిక్ష పడటం లో కృషి చేసిన పీపీ రామకృష్ణ రావు ,ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి, CMS ఎస్.ఐ శ్రీకాంత్ , కోర్ట్ కానిస్టేబుల్ సాగర్ మరియు CMS కానిస్టేబుల్స్ రాజు ,కిరణ్ కుమార్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.