👉ధర్మపురి ఎంఎల్ఏ లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి మన MLC అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని, నరేందర్ రెడ్డి ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని,ధర్మపురి ఎంఎల్ఏ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల MLC అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా: వి. నరేందర్ రెడ్డి గారి గెలుపే లక్ష్యంగా శుక్రవారం ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘంలో పట్టభద్రులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎమ్మెల్సీ అభ్యర్థి నరేంiదర్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గెలుపు పై పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశనిర్దేశం చేశారు
ఈ సందర్భగా గా ఎంఎల్ఏ మీడియాతో మాట్లాడుతూ..
ధర్మపురి నియోజకవర్గ పట్టబద్రులు కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మన ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం లోపే దాదాపు 56 వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది మన రేవంత్ రెడ్డి,

మన కాంగ్రెస్ ప్రభుత్వమని,కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉండే ప్రభుత్వమని, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇంటింటికి గడపగడపకు వెళ్లి పట్టభద్రులను కలిసి మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఎమ్మెల్యే ఎన్నికల్లో నాకోసం ఎలా అయితే కష్టపడ్డారో అదే విధంగా ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోసం మనందరం కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను నాయకులను కోరుతున్నామని, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.