👉 ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
👉🏻 కాంగ్రెస్ హైకమండ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బలపరిచిన నరేందర్ రెడ్డి గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మంగళ వారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి తో కలసి ఎమ్మెల్యే ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
👉 అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
👉🏻 యువతను ఆదుకునేందుకు నరేంద్ర మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఏమైంది ?
👉🏻 బీఆర్ఎస్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మరిచింది.
👉🏻 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాము
👉🏻 సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక ఉత్తర్వులు అందజేశారు.
👉🏻 గతంలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు వేతనం ఇవ్వడంలో జాప్యం చేస్తే,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల ఒకటిన వేతనాలు ఇస్తున్నాం.
👉🏻 పట్టభద్రులు రాజకీయాలకు అతీతంగా జీవన్ రెడ్డి నీ గెలిపించారు అని గుర్తు చేశారు.
👉🏻 బీ ఆర్ ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టి, పట్టభద్రుల పక్షాన నిలిచారు.
👉🏻 జీవన్ రెడ్డి స్థానంలో నరేందర్ రెడ్డి కి పట్టభద్రుల ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించిన నేపథ్యంలో కరీంనగర్ ముద్దు బిడ్డ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలనీ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.