👉 సీఎం రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
స్టార్టప్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి టీ హబ్ ( T-Hub ), బ్రెజిల్లోని గోయస్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హబ్ గోయస్ ( HUB GOIAS ) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి , ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, హెచ్ఐసీసీలో హబ్ గోయస్ ( HUB GOIAS ) ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం T-Hub పౌండేషన్ సీఈవో సుజిత్ జాగిర్దార్ , బ్రెజిల్ దేశ గోయస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్రెటరీ జోస్ ప్రెడెరికో లైరా నెట్టో ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందంతో తెలంగాణ స్టార్టప్లకు బ్రెజిల్లో అవకాశాలు, అలాగే బ్రెజిల్ స్టార్టప్లకు మన రాష్ట్రంలో అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రి-టెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారం పంచుకుంటాయి.
మార్కెట్ యాక్సెస్తో పాటు కెపాసిటీ బిల్డింగ్ ఇంక్యుబేషన్, సాంకేతిక భాగస్వామ్యం, పెట్టుబడుల అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై టీ-హబ్ ( T-Hub ), హబ్ గోయస్ ( HUB GOIAS ) కలిసి పని చేస్తాయి. రెండు దేశాల స్టార్టప్ ఎకో సిస్టమ్ల మధ్య సంబంధాలను’ ఈ ఒప్పందం బలోపేతం చేయనుంది.