J.SURENDER KUMAR,
తిరుమల శ్రీవారి ఆలయానికి సోమవారం ₹11.20 కొట్ల రూపాయల భారీ విరాళం భక్తులు అందించారు.
ముంబైకి చెందిన ప్రసీద్ ఉనో ఫ్యామిలీ ట్రస్ట్కు చెందిన భక్తుడు తుషార్ కుమార్ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కు ₹.11 కోట్ల భారీ విరాళం అందించారు.
దాత అదే మొత్తానికి డిడిని తిరుమలలోని టిటిడి అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరికి తన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.

భీమవరానికి చెందిన వెంకటరమణ అనే భక్తుడు టీటీడీకి చెందిన ఎస్వీ అన్నప్రసాద ట్రస్టుకు ₹ 10 లక్షలు విరాళంగా అందజేశారు.
ఆ భక్తుడు అదే మొత్తానికి డీడీని తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆయన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.

అదేవిధంగా తిరుపతికి చెందిన సాధు పృథ్వీ అనే భక్తుడు కూడా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు ₹ 10 లక్షల విరాళం ఇచ్చి, అదనపు ఈఓకు డీడీని అందజేశారు.