వైభవంగా బీర్పూర్ నర్సింహుడి కళ్యాణం !

J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మైన బీరుపూర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి కళ్యాణం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో రాత్రి వేద పండితుల, అర్చకుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఆవరణం లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మంటపం లో శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణ వేడుకలను అంగరంగా వైభోగంగా కన్నుల పండుగగా జరిగింది.

ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి సనాత సాంప్రదాయ పద్దతి లో నేరేల్ల గ్రామ వాస్తవ్యులు తలంబ్రాలు తీసుకువచ్చరు. ఈసందర్భంలో జగిత్యాల డిఎస్పి రఘచంధర్, స్వామివారికి పట్టువస్త్రాలు తలంబ్రాలు అందించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.


ఎమ్మెల్సీ కవిత, ఎల్ రమణ, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్దా వ వసంత తదితరులు పాల్గొన్నారు. చుట్టూ పక్కల గ్రామాల నుండి వచ్చిన భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి. స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎసై కుమారస్వామి పోలీస్ సిబంది పర్యవేక్షించారు.

ఈకార్య క్రమంలో కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్. ఆలయ పురోహితులు పెద్దసంతోష్, చిన్నసంతోష్, మధుసూదనా చార్యులు మా జీ. ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.