J. SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి రథోత్సవం. బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి జాతర ఉత్సవాలలో రథోత్సవం కీలక ఉత్సవం. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి తరలివచ్చిన భక్తజనంతో ధర్మపురి క్షేత్రం పోటెత్తింది.

బుధవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలు. మూడు రథములపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
బలిహరణం , తర్వాత భక్తుల సందర్శనం అనంతరం వేలాది మంది భక్తజనం గోవింద నామస్మరణలు, హర హర మహాదేవ, అంటూ భక్తి పరవశంతో నినాదాలు చేస్తూ, స్వామివారి రథములను క్షేత్ర పురవీధుల గుండా బ్రహ్మ పుష్కరిణి ,ఇసుక స్తంభం, నంది విగ్రహం వరకు, ఊరేగించారు.

అనంతరం అర్చక స్వాములు స్వామివారి ఉత్సవమూర్తులను పవిత్ర గోదావరి నది లో చక్ర స్నానం, నిర్వహించి ప్రత్యేక పూజాది కార్యక్రమాల అనంతరం క్షేత్రంలో ఊరేగించారు.

గోదావరి నదిలో చక్రస్నానం..
మధ్వాచారి వంశీయుల ఇంటి లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్, సిబ్బంది, పాలకవర్గ సభ్యులు అధ్యక్షుడు రవీందర్, అర్చకులు, వేద పండితుల సమన్వయంతో సాంప్రదాయబద్ధంగా రథోత్సవ పూజాది కార్యక్రమాలు జరిగాయి.

పోలీస్ యంత్రాంగం, రోప్ పార్టీ పోలీసు బృందాలు, రథాలకు, రథాలకు మధ్య ఇద్దరు ఎస్సైలు, పోలీస్ బలగాలతొ. బందోబస్తు ఏర్పాటు చేసి తొక్కిస్తాలాట జరగకుండా భద్రత చర్యలు చేపట్టారు.
👉 స్వామివారిని దర్శించుకున్న పట్టభద్రులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి !
కరీంనగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి దంపతులు బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

దర్శనానంతరం ధర్మకర్తల మండల అధ్యక్షుడు, అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి స్వామి వారి శేష వస్త్రం బహుకరించి ఘనంగా ఆశీర్వదించారు.