👉పర్సన్ ఇన్చార్ గా కె .నాగసంకీర్త !
J.SURENDER KUMAR,
ధర్మపురి సింగిల్ విండో ఛైర్మెన్ గా పదవి కాలం ముగిసి, ప్రభుత్వ ఉత్తర్వులతో తాత్కాలికంగా కొనసాగుతున్న ఎల్లలా శ్రీకాంత్ రెడ్డి నీ ప్రభుత్వం తొలగించి పర్సన్ ఇన్చార్జి గా కే. నాగసంకీర్త , అసిస్టెంట్ రిజిస్టార్ ను నియమించింది.
ఈ మేరకు ఈ నెల 3న ఉత్తర్వు సంఖ్య RC. No. 625/ 2025 C ద్వారా జగిత్యాల జిల్లా సహకారం సంఘ అధికారి మనోజ్ కుమార్ జారీచేశారు. దీంతో పాటు, గొల్లపల్లి, తిరుమలాపూర్, పెగడపల్లి సింగిల్ విండో అధ్యక్షుల స్థానం లో పర్సన్ ఇంచార్జి లను ప్రభుత్వం నియమించింది.
రాష్ట్రంలో 900 వందలకు పైగా సింగిల్ విండో లు ఉన్నాయి. వీటి పదవి కాలం గత నెలలో ముగిసింది. దీంతో తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రం లోని తొమ్మిది జిల్లాల సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీ), మరియు రాష్ట్ర సహ కార కేంద్ర బ్యాంకు(టెస్కాబ్) పాలకవర్గాల పదవీకాల పొడిగిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి జీవో 14 ను జారీ చేసింది.
ఇందులో ఆరు నెలలపాటు లేదా ? మళ్లీ ఎన్నికలు జరిగే వరకు అని కాకుండా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పొడిగింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. పలు సంఘాలపై ఆరోప ణలు, అభియోగాల తోపాటు విపక్ష పార్టీలకు చెందిన వారు అధ్యకులుగా ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల చట్టం 32లోని సబ్ సెక్షన్ 7(2) కింద పదవీకాలం ముగిసిన పాలకవర్గాలను తొలగించి స్థానంలో సంఘంలోని ఒక సభ్యుడిని , అధికారిని ,పర్సన్ ఇన్చార్జిగా నియమించే అధికారం ప్రభుత్వా నికి ఉంది.
జగిత్యాల జిల్లాలో 51 సింగిల్ విండో లు ఉన్నాయి. ఇందులో కొన్ని విండోల లో కోట్లాది రూపాయల నిధులు గొల్ మల్ జరిగినట్టు ఆ శాఖ అధికారుల విచారణ లో నిర్ధారించారు. ఈ అంశంలో కొందరు హై కోర్టు కు వెళ్లారు.
👉 పర్సన్ ఇన్చార్జిల పై కోర్ట్ కు !
తాత్కాలి క అధ్యక్షుడిగా కొనసాగుతున్న తనను తొలగించి ధర్మపురి విండో పర్సన్ ఇంచార్జి నియామకం పై శ్రీకాంత్ రెడ్డి హై కోర్ట్ ను ఆశ్రయించాడు. ఇదే విండో లో దాదాపు కోటి ఇరువది లక్షల రూపాయల నిధుల దుర్వినియోగం పై ప్రభుత్వం శ్రీకాంత్ రెడ్డి, సీఈఓ కు జారీచేసిన నోటీసులో వివరణ కోరింది. ఈ అవినీతి ఆరోపణల పై కూడా హైకోర్టు ను ఆశ్రయించి కొంత కాలంగా స్టే లో కొనసాగుతున్నాడు.