👉 జిల్లా విద్యుత్ ఎస్సీ సాలియ నాయక్ !
J.SURENDER KUMAR,
విద్యుత్ వినియోగదారులందరికి మరింత చేరువై వారికి వినూత్న సేవలు అందుబాటులో ఉండడం కోసం ప్రతి సోమవారం ”విద్యుత్ ప్రజావాణి” కార్యక్రమం చేపట్టామని జగిత్యాల జిల్లా విద్యుత్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ , సాలియ నాయక్ స్పష్టం చేశారు .
👉 జిల్లాలోని వినియోగదారుల ఫిర్యాదులను తీసుకొని వాటిని సకాలంలో పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ” విద్యుత్ ప్రజావాణి” నిర్వహించనున్నట్లు తెలిపారు . 2024 జూన్ 17 న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు .
👉 వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కరించడానికి అన్ని సర్కిల్ , డివిజన్ , సెక్షన్ ఆఫీస్ లలో అమలు చేస్తున్నామని తెలిపారు . వినియోగదారుల విద్యుత్ సమస్యలు ప్రధానంగా విద్యుత్ బిల్లుల సమస్యలు , మీటర్ల సమస్యలు , విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు , క్యాటగిరి మార్పు , పేరు మార్పు ప్రధమభరింతగా ఉన్న స్థంబాలు తదితర విద్యుత్ ఫిర్యాదుల సమస్య తీవ్రతను బట్టి అప్పటికప్పుడే లేదా సమయం తీసుకొని పరిష్కరించడానికి దోహద పడుతుందని తెలిపారు
👉 అలాగే వారితో సత్ సంబంధాలు మరింత మెరుగు పడుతాయని అన్నారు . , ఇప్పటి వరకు ” విద్యుత్ ప్రజావాణి” లో ….582….. ఫిర్యాదులు రాగా, ….523…పరిష్కరించామని తెలిపారు .
👉 విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కొరకు సర్కిల్ పరిధిలోని అన్ని ముఖ్య కార్యాలయాల్లో అనగా సర్కిల్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్ , ఈఆర్వో , సబ్ డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్ లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
👉 డివిజన్ ఆఫీస్ , ఈఆర్వో, సబ్ డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్ లలో “ప్రతి సోమవారం “ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు మరియు సర్కిల్ ఆఫీస్ లో అదే రోజు సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు .
👉 విద్యుత్ ప్రజా వాణి కార్యక్రమన్ని పటిష్ట పరిచడంలో భాగంగా సమీక్షలు నిర్వహించి విద్యుత్ వినియోగదారులు చేసే ఫిర్యాదులను సకాలంలో పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు
👉 .”విద్యుత్ ప్రజావాణి” వినియోగదారులకు మరింత చేరువలో అయ్యి వారితో మమేకమై ఉద్యోగస్తులు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని వివరించారు .