👉 యాసంగి సాగు నీటి సరఫరా పై వీడియో కాన్ఫరెన్స్ లో..
👉 నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి !
J.SURENDER KUMAR,
పంటలు కాపాడేందుకు అధికారులు సమన్వయం తో పని చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యాసంగి సాగు నీటి సరఫరా పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి లతో కలిసి ఆయా జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
👉 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో పంటలు ఎండి పోతున్నట్లు సమాచారం అందుతుందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎక్కువగా చేసి చూపుతూ ప్రభుత్వానికి వ్యతిరేక వాతావరణం సృష్టించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు, వ్యవసాయ అధికారుల నుంచి జిల్లా కలెక్టర్లు రిపోర్ట్ తీసుకుని విద్యుత్ శాఖ అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ పంట నష్టం, ఎండిపోవడం తగ్గించాలని మంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో కొంత నీటి కొరత ఉన్న నేపథ్యంలో నీటి సరఫరా సమర్థవంతంగా చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 55 లక్షల ఎకరాలలో వరి పంట సాగు అవుతుందని అన్నారు.

జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖ , ఇరిగేషన్, విద్యుత్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పంట నష్టాన్ని తగ్గించాలని మంత్రి ఆదేశించారు. సాగు నీరు సరఫరా కాల్వల ద్వారా చేరని ప్రాంతాల్లో నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేయడం వల్ల పంట నష్టం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
రాజకీయ దురు ద్దేశాలతో ప్రస్తుత ఉన్న పరిస్థితిని ఎక్కువ చేసి చూపించిన, రబీ యాక్షన్ ప్లాన్ లో లేని ప్రాంతాలలో పంటలు ఎండి పోతున్నట్లు వార్తలు వచ్చిన వాటిపై కలెక్టర్ లు వెంటనే స్పందించి ఐ& పిఆర్ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలిసేలా క్లారిటీ ఇవ్వాలని మంత్రి కోరారు.
👉 మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ……
18 లక్షల ఎకరాలు వివిధ ప్రాజెక్టు కాల్వల క్రింద , 37 లక్షల బోర్ల క్రింద వరి పంట సాగు అవుతుందని అన్నారు. దేవాదుల ప్రాజెక్టు వద్ద జనగాం, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో కొంత మేర ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు.
రాబోయే 10 నుంచి 15 రోజులలో నీటి పారుదల శాఖ అధికారులతో అవసరమైన నీటి విడుదల కట్టుదిట్టంగా చేస్తూ పంటలను కాపాడే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని అన్నారు. సాగర్ కేనాల్ లో నిర్వహణ సరిగ్గా లేకపోవడం షటర్ల వద్ద కొన్ని మరమ్మత్తు వల్ల చివరి ఆయకట్టుకు నీరు చేరుకోవడం లేదని అన్నారు.
ఆయకట్టు క్రింద కాలువలో విడుదల చేసే నీటిలో ముందు టెయిల్ ఎండ్ ప్రాంతాలకు నీరు వచ్చేలా చూడాలని అన్నారు. నాగార్జున సాగర్ క్రింద ఒక ఎకరం కూడా ఎండి పోవడానికి వీలు లేదని, 3 నియోజకవర్గాల మేర గోదావరి నీళ్లు 1500 క్యూసెక్కుల సీతా రామ ద్వారా తీసుకొని వచ్చామని తెలిపారు. కాల్వల పై మోటర్లు పెట్టి నీటి దుర్వినియోగం అవుతుందని అక్కడ రాత్రి సమయాల్లో విద్యుత్ బంద్ చేయాలని మంత్రి సూచించారు.
పోలీసుల సహకారం తీసుకొని చివరి ఆయ కట్టుకు నీళ్లు చేరేలా చూడాలని ఎక్కడికక్కడ బాధ్యతలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న సమయం చాలా కీలకమైందని, విద్యుత్ సరఫరా , పై ప్రాంతాల్లో నీరు వృధా కాకుండా చూడడం , అవసరమైన చోట పోలీసు బందోబస్తు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు.
భూగర్భ జలాలు తగ్గిపోవడం, బోర్లు ఎండిపోవడం వల్ల ఎక్కడైనా సాగు నీటి ఇబ్బందులు ఉన్నాయో పరిశీలించాలని అన్నారు. పంట కోతలు వచ్చే వరకు వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఫీల్డ్ లెవల్ లో ఉంటూ స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖ అధికారులకు కలెక్టర్ దృష్టికి తీసుకుని రావాలని మంత్రి సూచించారు.
👉 సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ….
రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ సరఫరా సమస్యలు లేవని అన్నారు. 7 జిల్లాలో 44 వేల ఎకరాలలో కొంత ఇబ్బందులు ఉన్నట్లు సమాచారం అందుతుందని అన్నారు. జనగాం జిల్లాలో పంటలు కాపాడేందుకు మోటార్ల మరమ్మత్తులు పూర్తి చేసామని, సిద్దిపేట జిల్లాలో పంటల సంరక్షణకు రంగనాయక సాగర్ రిజర్వాయర్లు ఒకటిన్నర టీఎంసీల విడుదల చేశామని తెలిపారు.
సిద్దిపేట, జనగామ, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వనపర్తి మొదలగు జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయని వీటిని పక్కగా పర్యవేక్షిస్తూ పొలాలు ఎండిపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన ప్రతి నీటి చుక్కను పూర్తి స్థాయిలో వాడుతూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు.
ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత జిల్లా ఇరిగేషన్ అధికారి రమేష్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.