పోలీస్ ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది మంత్రి శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,


పోలీస్ ఉద్యోగం అంటే కత్తి మీద సాము లాంటిదని, అలాంటి విధులను నిర్వహిస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు అన్నారు. ఇసుక రవాణా చేసే లారీ ల వేగాన్ని నిరోధించాలని శాంతి భద్రతల విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, శాంతి భద్రత రక్షణలో భాగంగా ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.


జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో  కెమెరాల కమాండ్ కంట్రోల్ రూంను  జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే తో కలిసి, మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం ప్రారంభించారు.
అనంతరం  మంత్రి శ్రీధర్ బాబు  మాట్లాడుతూ..
నేరాలను పసిగట్టి శాంతి భద్రతలను కాపాడే విధంగా వ్యాపారస్తుల సహకారంతో సీసీ కెమెరలను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు  కాపాడుతున్న పోలీస్ లకు ప్రజలు అండగా నిలవలని అన్నారు.


కాటారం అన్ని కాలనీల్లో దాదాపు 63 కెమెరాలు అమర్చి పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ రూంలో మానటరింగ్ చేస్తారని ఆయన అన్నారు.
ముఖ్యంగా యువత మదకద్రవ్యల నిరోధానికి పోలీసులకు సహాకరించాలని కోరారు.


మదకద్రవ్యలకు సహకరించుతున్న ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు వారి పట్ల పోలీసు వారు  కఠినంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు


మరొకవైపు  బెట్టింగ్ యాప్స్ కు
పాల్పడుతున్న వారి పై  మరియు వారికి సహకరిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని,  బెట్టింగ్ యాప్ లో బెట్టింగ్ పెట్టి సర్వం కోల్పోయి ప్రాణాలు తీసుకుంటున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆదేశాలు జారీ చేశారని మంత్రి అన్నారు.


రానున్న రోజుల్లో  మండలాల కేంద్రంలో చిన్న పరిశ్రమలు ఏర్పాటు  చేస్తానని తెలిపారు
నేను ఫోన్ చేసిన కూడా  న్యాయం అన్యాయాలు చూసి  పోలీసు వారు పనిచేయాలని అన్నారు
ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నదా అధికారులు. ఎస్సైలు సీఐలు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు