తన గెలుపు లో మైనార్టీలు అండ ఉంది ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


మైనార్టీ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అన్ని మతాలను సమానంగా చూసే ప్రభుత్వమని, తన గెలుపులో మైనార్టీలు అండగా ఉన్నారని, మైనార్టీ కార్పోరేషన్ నుండి కూడా అర్హులైన మైనార్టీ సోదర సోదరీమణులకు రుణాలను  అందిస్తామని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గొల్లపల్లి మండలం గోవిందపల్లి గ్రామంలోనీ  SV గార్డెన్ లో ప్రభుత్వం తరఫున శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు.


ఈ సంధర్బంగా మాట్లాడుతూ..
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు  తెలిపి వారితో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.