టిటిడి స్థానిక ఆలయాల్లో ఉగాది వేడుకలు !

👉 మార్చి 30న ఉగాది పర్వదినం…


J.SURENDER KUMAR,


 టిటిడి స్థానిక ఆలయాల్లో మార్చి 30న ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం , శ్రీకోదండరామాలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. 

👉 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో …

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు స్నపనతిరుమంజనం వైభవంగా జరుగనుంది. 
 అనంతరం సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు పుష్పపల్లకీలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. 

👉 శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో : 

 తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. 

👉 శ్రీ కోదండరామాలయంలో ..


 తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జీయర్‌ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేయనున్నారు. 

👉 కార్వేటినగరంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో  
 కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు.  సాయంత్రం  4 నుండి 5.30 గంటల వరకు ఆలయంలో ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం ర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.  

👉 అప్పలాయగుంట :

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం 9 నుండి 10 గంటల వరకు పంచాంగ శ్రవణం ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటనలో తెలిపారు.