ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలి !

👉 సీరియల్ నెంబర్ ప్రకారం రైతుల నుంచి  పంట కొనుగోలు చేయాలి !

👉 ధాన్యం తరలింపు కేటాయించిన రైస్ మిల్లులకు మాత్రమే జరగాలి !

👉 జగిత్యాల్ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ !

J.SURENDER KUMAR,

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని  జగిత్యాల జిల్లా  కలెక్టర్  సత్య ప్రసాద్ అన్నారు.
బుధవారం  కలెక్టర్ మెట్పల్లి పట్టణంలోని ఆత్మ నగర్ మహిళా సమాఖ్య ఐకెపి సెంటర్ ఆధ్వర్యంలోమరియు ఆత్మకూరు మెట్ల చిట్టాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పి ఎ సి ఎస్ ఆధ్వర్యంలోవరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.

👉ఈ సందర్భంగా  కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ,  


భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని,  కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం రెగ్యులర్  గా చెక్ చేయాలని, తాలు లేకుండా ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రం చేయాలని , నాణ్యత ప్రమాణాలు రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని ఎలక్ట్రికల్ తూకం ఎప్పటికప్పుడు చూడాలి కలెక్టర్ తెలిపారు


ధాన్యం తరలింపు సమయంలో కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ వడగళ్ల పడుతాయి కాబట్టి తాటి పత్తర్లు అందుబాటులో తాగునీరు ఉండేలా చూడాలని. ఎలాంటిసమస్యలు రాకుండా ముందస్తుగా ప్లానింగ్ చేసుకోవాలని  కలెక్టర్ అధికారులు ఆదేశించారు.


  కొనుగోలు కేంద్రాలకు అలాట్ చేసిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని కలెక్టర్ సూచించారు.   ధాన్యం తరలింపు అంశంలో రవాణా సమస్య రాకుండా అవసరమైన లారీలును కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు . ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్  డాటా ఎంట్రీ  చేయాలని కలెక్టర్ తెలిపారు. 


ధాన్యం నాణ్యత ప్రమాణాలు పై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. గ్రేడే ఏ రకం ధాన్యానికి క్వింటాల్ ₹ 2320 రూపాయల, సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్ ₹ 2300 రూపాయలు ఉంటుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చిన సీరియల్ నెంబర్ ప్రకారం నాణ్యమైన ధాన్యం  కొనుగోలు చేపట్టాలని అన్నారు.


కలెక్టర్ వెంట  మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్,  డిఆర్డిఓ పిడి రఘువరన్, జిల్లా కో కోపరేటివ్ డి సి ఓ.మనోజ్ కుమార్, ఎంపీడీవో ఎమ్మార్వో లు సివిల్ సప్లై అధికారులు మరియు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.