J.SURENDER KUMAR,
జపాన్ దేశ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి కి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రతినిధులు స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఈ నెల 16 నుంచి ఏడు రోజుల పాటు జపాన్ దేశంలో పర్యటించింది. ఈ పర్యటనలో రాష్ట్రానికి ₹ 12,062 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. పలు రంగాల్లో సహకారం, సాంకేతిక భాగస్వామ్యం కోసం చర్చలు జరిపింది.
👉 ₹ 12,062 కోట్ల పెట్టుబడుల ఒప్పందం !
జపాన్ కంపెనీలతో ₹12,062 కోట్ల పెట్టుబడుల ఒప్పందం, 30,500 మందికి ఉపాధి అవకాశాలు, దావోస్ పర్యటనలో ₹1.78 లక్షల కోట్ల పెట్టుబడులు, అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా పర్యటనలో తెలంగాణకు ₹ 14,900 కోట్ల పెట్టుబడులు, 2024 దావోస్ పర్యటనలో ₹ 40 వేల కోట్ల పెట్టుబడులు, ఇప్పటి వరకు తెలంగాణకు ₹ 2,44,962 కోట్ల పెట్టుబడులు. వచ్చాయి.
