ఇందిరమ్మ లబ్ధిదారులకు ₹ 20 కోట్ల  చెక్కులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద బేస్‌మెంట్ వరకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయలు చెల్లించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  లాంఛనంగా ప్రారంభించారు.
2019 మంది బేస్‌మెంట్ వరకు ఇండ్లను పూర్తి చేసుకోగా వారికి ,₹ 20.19 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ  జమ చేశారు.


వికారాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన పలువురు లబ్దిదారులకు లక్ష రూపాయల విలువైన చెక్కులను ముఖ్యమంత్రి  అందజేశారు. 

చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్,  పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.