జ్యోతి రావు పూలే విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన !

👉 నెక్లెస్ రోడ్డు మార్గం, ఐమాక్స్ సమీపంలో..


J.SURENDER KUMAR,

మహాత్మా జ్యోతిరావు పూలే  జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆ మహనీయుడి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పూలమాల వేసి నివాళులు అర్పించారు.


అంతకుముందు ముఖ్యమంత్రి  ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి మహాత్మా జ్యోతి రావు పూలే విగ్రహ ఏర్పాటుకు సంబంధించి నెక్లెస్ రోడ్డు మార్గం, ఐమాక్స్ సమీపంలో స్థలాన్ని పరిశీలించారు. స్థలాన్ని పూర్తిస్థాయిలో సర్వే చేసి విగ్రహ ఏర్పాటుకు అవసమైన ప్రణాళికను అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తో పాటు సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ , పలువురు ప్రజాప్రతినిధులు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు అధికారులు పాల్గొన్నారు.