👉 యాప్, వెబ్ పోర్టల్ ప్రారంభించిన మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు !
👉 పాల్గొన్న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్ !
J. SURENDER KUMAR,
కాళేశ్వరంలో త్వరలో జరగనున్న ‘సరస్వతీ పుష్కరాలు’ కోసం, అధికార యంత్రంగా భారీ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. 2025 మే 15 నుండి 26 వరకు జరగనున్న సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్లు వివరాలు భక్తులకి సమగ్రంగా తెలిపేందుకు వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం హైదరాబాదులోని డా బి ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో ప్రారంభించారు.
ఈ ప్రారంభ కార్యక్రమంలో దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక పరిషత్ అడ్వైజర్ గోవింద హరి, ఆలయ ఈవో మహేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

👉 ఏర్పాట్లకు ₹ 35 కోట్లు కేటాయింపు !
సరస్వతీ పుష్కరాలు’ పండుగకు ₹ 35 కోట్ల వ్యయంతో స్నాన ఘాట్ల విస్తరణతో సహా వివిధ అభివృద్ధి పనులను విసృతంగా చేపట్టినట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. . తమ ప్రభుత్వ హయాంలో గతంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించామని, ఇప్పుడు కూడా ఆ అవకాశం మాకు రావడం ఆ భగవంతుడి ఆశీస్సులున్నాయని ఆయన తెలిపారు.
👉 ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ…
తమ ప్రభుత్వం దేవాలయాల విషయంలో చాలా క్రీయాశీలకంగా పని చేస్తుందన్నారు. గత ప్రభుత్వం దేవాదాయ శాఖ సంబంధిత వ్యవహారాలను పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. తాను దేవాదాయ శాఖ మంత్రి అయ్యాక పలు అంశాలను, ప్రతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్టు తెలిపారు. సమ్మక్క సారక్క జాతర, కొమురవెల్లి కళ్యాణం, భద్రాచలం కళ్యాణం తదితర అన్నీ. కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినట్టు వివరించారు.
పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.
👉 ఉత్తరాన ప్రయాగ వద్ద, దక్షిణ భారతంలో కేవలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాత్రమే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని, పవిత్ర సరస్వతీ పుష్కరస్థానం చేసిన వారికి సమస్త పాపములు తొలగిపోవునని భక్తుల ప్రగాడ విశ్వాసమని అన్నారు.
👉 ప్రతిరోజు దాదాపు లక్ష మంది భక్తులు

సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు సుమారు 50 వేల నుడి లక్ష వరకు భక్తులు వచ్చి పుష్కర స్నానం చేసి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్ల దర్శనం చేసుకుంటారని అంచనా వేసి తెలంగాణ ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం సుమారు ₹ 35 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినది.
👉 పుష్కరాల నిధులతో ప్రస్తుతం ఉన్న ఘాట్ యొక్క వెడెల్పు పెంచుతూ అధునాతనంగా అన్ని సౌకర్యాలతో నూతన ఘాట్ నిర్మాణం చేసి దానిని సరస్వతి ఘాట్ గా నామకరణం చేయుటకు ఏర్పాట్లు జరుగుచున్నవి.
👉 సరస్వతి పుష్కర ఘాట్ పైన 17 అడుగుల ఏకశిల సరస్వతి అమ్మవారి రాతి విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రెండు ఘాట్ల వద్ద స్వాగత తోరణంల నిర్మాణం కూడా జరుగుతుంది.
👉 పుష్కరాలకు వచ్చే భక్తుల వసతి కొరకు దేవస్థానం వద్ద 100 రూముల వసతి గృహం, డార్మేటరి భవనం, నూతనముగా అందుబాటులోనికి తీసుకొనిరావడం జరిగింది. అంతేకాకుండా ఘాట్ వద్ద 100 గదులతో కూడిన టెంట్ సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
👉 భక్తుల స్నానాల కొరకు షవర్లు ఏర్పాటు, దుస్తులు మార్చుకొనే గదులు, వేసవి కావడముతో దేవాలయం చుట్టూ మరియు ఘాట్ల వద్ద చలువ పందిర్లు, OHSR వాటర్ ట్యాంకులు నిర్మించి త్రాగు నీటి ఏర్పాటు, దేవాలయం చుట్టూ సి.సి. రోడ్ల నిర్మాణం, పిండ ప్రధాన మండపం, శాశ్వత మారుగుదొడ్లు, స్నానం గదుల నిర్మాణం తదితర పనులు చేపట్టడం జరిగింది.
👉 పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కొరకు రాష్ట్రము లోని వివిధ ప్రాంతాల నుండి. కాళేశ్వరమునకు ఆర్..టి.సి యాజమాన్యం ప్రతేక బస్సులు నడుపుటకు నిర్ణయించినది. మరియు కాళేశ్వరము లో వివిధ ప్రాంతల వద్ద పార్కింగ్ స్థలాలను గుర్తించి చలువ పందిర్లు, త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరుగుచున్నది.
👉 శ్రీ కాళేశ్వర ముక్తిశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద భక్తులకు సరిపోను విధముగా లడ్డు, పులిహోర ప్రసాదములను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అంతేకాకుండా భక్తులకు అన్నదానం మరియు ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
👉 అదేవిధముగా త్రివేణి సంగమం వద్ద పుష్కరాలు జరిగే పన్నెండు రోజులు సరస్వతి ఘాట్ వద్ద కాశీ నుండి వచ్చే పురోహితులచే ప్రత్యెక హారతి కార్యక్రమం నిర్వహిచడం జరుగుతుంది
👉 దేవాలయము వద్ద పుష్కరాలు జరిగే 12 రోజులు ప్రత్యెక హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాల కొరకు ఏర్పాట్లు చేయడం జరిగింది.

👉 పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వద్ద , పుష్కర ఘాట్ ల వద్ద బస్టాండ్ మరియు పార్కింగ్ స్థలాల వద్ద డాక్టర్లు , వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండే విధముగా ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
👉 పుష్కరాల పనులు అన్నీ ప్రారంభమై చురుగ్గా జరుగుచున్నాయి. జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో జిల్లా యంత్రాగం మొత్తం పుష్కర ఏర్పాట్ల పనులలో నిమగ్నమై ఉన్నారు. పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి అన్ని పనులు పూర్తి చేయాలనే దృడ సంకల్పంతో అన్ని శాఖల అధికారులు పనిచేస్తున్నారు.