J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం, బుగ్గారం, ధర్మపురి మండలాలలోని పలు గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

ధర్మారం లో ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు
బుగ్గరం మండలం వెల్గొండ లో, ధర్మపురి మండలం దోనూర్ లో DCMS ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
👉 నరసింహుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే !

జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోనీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి నీ ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
