👉 జర్నలిస్టులకు అండగా నిలిచిన వడ్డేపల్లి రాజు !
J.SURENDER KUMAR,
జర్నలిస్టుల శ్రమ శక్తితో నడుస్తున్న కొన్ని కార్పొరేట్ పత్రికల యాజమాన్యాలు, జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధులు కేటాయించని వాళ్లు సిగ్గుతో తలదించుకోవాలి .
👉 ఎందుకంటే ?
ఆయనకు కార్పొరేట్ పత్రికలు, టీవీ ఛానల్ లేవు, నిత్యం ప్రజల పక్షాన పోరాటం చేసే జర్నలిస్టుల కష్టాలు దగ్గర నుండి చూసి వ్యక్తి ఆయన. ఆ జర్నలిస్టుల సంక్షేమం కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అతడే కూకట్ పల్లి బిజెపి సీనియర్ నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచారు.
తన జన్మదిన వేడుకల సందర్భంగా రాజేశ్వరరావు ₹ 25 లక్షల చెక్కును మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అందించారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం, శాశ్వత నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచించిన ఆయన కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
👉 ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ.
చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను చూసి తాను చెల్లించానని. తన సూచన మేరకు కూకట్పల్లిలోని సీనియర్ జర్నలిస్టులు ఏకతాటిపైకి వచ్చి కూకట్పల్లి జర్నలిస్టు మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. కోటి రూపాయలను జర్నలిస్టులు శాశ్వత అవసరాలైన భూమి కొనుగోలు కోసం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ జర్నలిస్టులకు అండగా నిలిచిన వడ్డేపల్లి రాజును అభినందించారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, ప్రధాన కార్యదర్శి దయాసాగర్, కోశాధికారి ఎం ఏ కరీం, సీనియర్ జర్నలిస్టులు తొట్ల పరమేష్, నిమ్మల శ్రీనివాస్, విద్యా వెంకట్, నవీన్ రెడ్డి, వేణుమాధవ్, మాణిక్య రెడ్డి, నాగరాజు, లక్ష్మణ్, హరి, దామోదర్, విష్ణు, రాము, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
