మాజీ మంత్రి జానారెడ్డి తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు !

J.SURENDER KUMAR


మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం కలిగిన మాజీ మంత్రి జానారెడ్డి తో సోమవారం చర్చించారు. ఈ చర్చలలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవ రావు కూడా పాల్గొన్నారు.

👉 శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ , ప్రొ. హరగోపాల్ తో పాటు పలువురు ప్రతినిధులు ముఖ్యమంత్రి ని కలిసి మావోయిస్టులతో చర్చలు జరిపే అంశంపై ఒక వినతి పత్రాన్ని అందించారు. ఈ విషయంలో కేంద్రంతో సంప్రదింపులు జరపాలని కమిటీ ప్రతినిధులు కోరారు.

👉 నక్సలిజాన్ని ఒక సామాజిక కోణంలో చూస్తున్నందున ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్లొచ్చనే అంశంపై  జానారెడ్డి, కేశవరావులతో ముఖ్యమంత్రి  సమాలోచనలు జరిపారు.