J.SURENDER KUMAR,
రాష్ట్రంలోనే అత్యధిక పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు అయ్యాయి. జగిత్యాల లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాల, క్రిటికల్ కేర్ యూనిట్ ఇలా అన్ని విధాలుగా జగిత్యాల జిల్లా మెడికల్ హబ్ గా గుర్తింపు పొందిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల పట్టణ 10 వ వార్డ్ లింగంపేటలో ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ కార్యక్రమంలో భాగంగా ₹ 13 లక్షలతో నిర్మించిన బస్తి దవాఖాన ను గురువారం ప్రారంభించి, వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యం లో టీబీ అవగాహన పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
అనంతరం జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలికల) ₹ 10 లక్షలతో నిర్మించిన మరుగు దొడ్ల ను ప్రారంభించారు.
పట్టణంలోని 8వ వార్డు భవానినగర్ లో ₹ 14 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.
👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ…

జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో జాప్యానికి కారణం గత ప్రభుత్వ హయంలో నిధుల మంజూరు ఆలస్యమే కారణం అన్నారు. మెడికల్ కాలేజి మంజూరు చేసి గత ప్రభుత్వం లో నిధులు మంజూరు చేయకపోవడం తో కాంట్రాక్టర్ పనిచేయలేని పరిస్థితి వచ్చింది.. అన్నారు
పక్క నియోజక వర్గాల్లో సైతం డబల్ బెడ్ రూం ఇండ్ల ను గత ప్రభుత్వం మంజూరు చేయటం జరిగింది అని ఎన్ని పూర్తి చేశారో చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
జగిత్యాల లో పేద ప్రజలకు అందుబాటులోకి 4520 డబల్ బెడ్ రూం ఇళ్లు. గత ప్రభుత్వ హయాంలో బిల్లులు రాక కాంట్రాక్టర్ లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. గత ప్రభుత్వంలో బాకాయి బిల్లులు నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంజూరు చేస్తున్నాం అన్నారు.
👉 ప్రెస్ క్లబ్ నిర్మించాం !
గత ప్రభుత్వం లో ప్రెస్ క్లబ్ భవనం నిధులు మంజూరు చేశాం, భవనం పూర్తి అయినా బిల్లులు రాక చాలా ఇబ్బంది అయింది. బిల్లులు ఈ ప్రభుత్వంలో చెల్లించడం జరిగింది అని జర్నలిస్ట్ లకు తెలుసు అని ఎమ్మెల్యే అన్నారు.
వ్యక్తి గతంగా విమర్శించడం వల్ల తనకు నష్టం కాదని,తన జీవితం తెరచిన పుస్తకం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పట్టణం లో 18వేల కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్ల,.నూతన ఉద్యోగాలు, రుణ మాఫీ,.ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
ప్రజల డబ్బు ప్రజలకు అందించడమే ప్రజా ప్రతినిధుల బాధ్యత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రమోద్, కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాలా జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.