నవభారత వికాసానికి బాటలు వేసిన అంబేద్కర్!

👉 సర్వ మానవాళి సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు !

👉 హాజరైన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి తదితరులు !

👉 ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

అన్ని వర్గాల సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అని  సమానత్వ నియమాన్ని అనుసరించడం ద్వారా భారత సమాజాన్ని పునర్నిర్మించాలని, నవ భారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అని ధర్మపురి ఎమ్మెల్యే  ప్రభుత్వ విప్అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


రాజ్యాంగ నిర్మాత, దళిత, బడుగు, బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత భారతరత్న బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రం లో సోమవారం తహసిల్ చౌరస్తా వద్ద  బి.ఆర్ అంబేద్కర్   విగ్రహానికి లక్ష్మణ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.


అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆద్వర్యం లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొని, కేక్ కట్ చేసి, ప్రసంగించారు.  జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ,జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ది అధికారి రాజ్ కుమార్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

👉 ఈ సంధర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ …..

ఆ మహనీయుని ఆశయ సాధన కోసం అందరూ పాటుపడాలని , ఆ మహానేత కన్న భారతావని కోసం కృషి చేయాలని సూచించారు. అంబేద్కర్ సామాజిక సంస్కర్త, ఆర్థికవేత్త, రాజకీయవేత్త, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడని కొనియాడారు.

సమాజంలోని అణగారిన వర్గాలపై సామాజిక, కుల వివక్షను అంతం చేయడానికి నిరంతరం కృషి వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అన్ని వర్గాల సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అని గుర్తుచేశారు.

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీఆర్‌ అంబేద్కర్‌ దేశానికి తొలి న్యాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, తన పదవీకాలంలో సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలు, సంస్కరణలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.

దేశంలోని అణగారిన వర్గాల ప్రజలకు విద్య యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం, వారి ఆర్థిక స్థితిని పెంచడం. భారతదేశం నుంచి కుల వ్యవస్థను నిర్మూలించడానికి “విద్య – ఉద్యమించు – సంఘటితం” అనే నినాదంతో సామాజిక ఉద్యమాన్ని కూడా నడిపించారని అన్నారు.


 అందరు మానవుల సమానత్వ నియమాన్ని అనుసరించడం ద్వారా భారత సమాజాన్ని పునర్నిర్మించాలని ఆయన కోరుకున్నారని లక్ష్మణ్ కుమార్ తెలిపారు.


సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు అవకాశాల కోసం అంబేద్కర్‌ పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
రాజీవ్ యువ శక్తి పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల హక్కుల కోసం అంబేద్కర్‌ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు.


ప్రభుత్వం తో చర్చించి జగిత్యాల జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ భవన్, అలాగే ఎస్సీ స్టడీ సర్కిల్ కి శాశ్వత భవన నిర్మాణం మంజూరు  చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక శాసన సభ్యులు  సంజయ్ కుమార్  మాట్లాడుతూ అంబేడ్కర్ ప్రపంచ మేధావి అని, ఐక్య రాజ్య సమితి అతన్ని సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా ప్రకటించిందని, అందరూ అతను చూపినా బాటలో పయనించాలని ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో జగిత్యాల డిఎస్పి  దుర్శేటి రఘు చందర్, కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ ఛైర్మన్ జ్యోతి లక్ష్మణ్,అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు, నాయకులు, అధికారులు,ప్రజలు కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.