J.SURENDER KUMAR,
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి పోలీస్ స్టేషన్ కు రోడ్డు ప్రమాద నియంత్రణ పరికరాలను అందుబాటులో ఉంచి రోడ్డు ప్రమాద నియంత్రణ చర్యలకు కార్యాచరణ ప్రణాళిక కు శ్రీకారం చుట్టినట్టు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ భద్రత సామాగ్రి, బ్రీత్ అనలైజర్ పరికరాలు పోలీస్ స్టేషన్ లలో అందుబాటు లో ఉన్నట్టు ఎస్పీ ప్రకటన లో వివరించారు.
రాష్ట్ర డిజిపి కార్యాలయం ద్వారా జిల్లా కేంద్రంకు వచ్చిన అధునాతన పరికరాలు ఫ్లెక్సబుల్ ఐరన్ బారికేడ్స్ , ట్రాఫిక్ కోన్స్, రిఫ్లెక్ట్ జాకెట్స్, బ్రీత్ అనలైసర్స్, LED బటన్స్, బొల్లార్డ్స్, రేడియం టేప్ రోలర్స్, డిజిటల్ వీడియో కెమెరాస్, ఫోల్డెడ్ బారికెట్స్, పరికరాలను గురువారం పోలీస్ ప్రదాన కార్యాలయం లో జిల్లాలో వివిద పోలీస్ స్టేషన్ ల అదికారులకు పంపిణీ చేశారు.
👉 ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
జిల్లా లో ట్రాఫిక్ నియమాలను మరింత పకడ్బందీగా అమలు పరచడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు అధునాతన ట్రాఫిక్ పరికరాలను అందుబాటులోకి తేవడం జరిగిందనీ అన్నారు.
కాలానుగుణంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి , ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరడానికి మరియు ట్రాఫిక్/పోలీస్ సిబ్బంది ఎఫెక్టివ్ గా విధులు నిర్వహించడానికి ఈ ట్రాఫిక్ పరికరాలు ఎంతగానో ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ చేయడం తో ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. అదే విదంగా బందోబస్తు సమయంలో ఫ్లెక్సబుల్ ఐరన్ బారికేడ్స్ ఎంత ఉపయోగపడుతాయని అన్నరు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి భీమ్ రావు, డిఎస్పి లు రఘు చంధర్, రాముల, రంగా రెడ్డి, మరియు DCRB, SB,CCS, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,ఆరిఫ్అలీఖాన్, శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ మరియు సి.ఐ లు ఎస్.ఐ లు పాల్గొన్నారు.