👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు !
J.SURENDER KUMAR ,
రాష్ట్రం లోని 33 జిల్లాల్లోని ప్రతి ఇల్లు, కార్యాలయానికి తెలంగాణా ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు కల్పించనున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి డీ. శ్రీధర్ బాబు వెల్లడించారు. బేగంపేటలో గురువారం టీ ఫైబర్ నూతన కార్యాలయాన్ని ప్రారంబించిన సందర్బంగా ఆయన ప్రసంగించారు.
👉 కేబుల్ అపరేటర్ల సహకారంతో లాస్ట్ మైలు వరకు టివి ఛానెల్స్ సదుపాయాలు కూడా కల్పిస్తామని తెలిపారు. టీవీ సెట్లను కంప్యూటరు మానిటర్ గా వినియోగించుకుని విద్యార్థులు ప్రయోజనం పొందేలా టెక్నాలజీ రూపొందించినట్టు శ్రీధర్ బాబు చెప్పారు.
👉 ‘టీ ఫైబర్ ఇప్పటికే 424 మండలాల్లోని 8,891 గ్రామ పంచాయతీలను అనుసంధానం చేసింది. మరో 7,187 పంచాయతీలు సేవలు అందుకోవటానికి సిద్దంగా ఉన్నాయి. ఈ సంవత్సరం 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్టివిటీ కల్పించాం.
👉 2027 నాటికి 60 వేల కార్యాలయాలను అనుసంధానం చేస్తాం. టీ ఫైబర్ ఇకపై T-NxT పేరుతో సేవలు అందిస్తుంది. కార్యక్రమంలో వ్యాపార భాగస్వాములతో 9 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి’. ఈ సంధర్భంగా శ్రీధర్ బాబు టీ ఫైబర్ కొత్త లోగోను ఆవిష్కరించారు.
👉 ‘తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన డేటాను సురక్షితంగా ఉంచగల సావరిన్ క్లౌడ్ ను మంత్రి ప్రారంభించారు. కేవలం వైర్లను జత చేయటం కాదు. ప్రజలను, వాళ్ళ ఆలోచనలను, అవకాశాలను కలుపుతున్నాం అని మంత్రి ప్రకటించారు.
👉 టీ ఫైబర్ కోసం కొత్త విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. తెలంగాణా ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా శ్రీధర్ బాబు బాధ్యతలు స్వీకరించారు.
కార్యక్రమంలో ఐటీ శాఖ డిప్యూటీ సెక్రెటరీ భవేష్ మిశ్రా, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ పన్నేరు, పలువురు అధికారులు పాల్గొన్నారు.