J.SURENDER KUMAR,
అహ్మదాబాద్ లో జరుగుతున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనడానికి మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అహ్మదాబాద్ చేరుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమంను సాయంత్రం సందర్శించారు.
జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. సబర్మతీ ఆశ్రమంలో సాగిన మహాత్మాగాంధీ జీవన విధానం, ఆశ్రమ విశిష్టతలను ఆశ్రమ పర్యవేక్షకులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో గాంధీ వాడిన చరఖాను తిప్పి దాన్ని పరిశీలించారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన ప్రార్థనలో సీఎం పాల్గొన్నారు.