తెలంగాణ అతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్​ వరల్డ్​ పోటీలు !

👉  హైదరాబాద్ రానున్న  120 దేశాల మ మోడల్స్​ !

👉 చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ !

👉 చౌమొహల్ల ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్ !

👉 స్వాగత ఏర్పాట్లపై అధికారుల సమీక్ష !


J.SURENDER KUMAR,


తెలంగాణ టూరిజం బ్రాండ్ పెరిగేలా, తెలంగాణ అతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్​ వరల్డ్​ పోటీలు ఉండాలని  తెలంగాణ  టూరిజం సెక్రటరీ స్మిత సభర్వాల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
స్వాగత ఏర్పాట్ల పై    మంగళవారం సమీక్ష నిర్వహించారు.    మే 7  నుంచి 31 వరకు  72వ మిస్ వరల్డ్  పోటీలు  తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో  జరుగుతున్నాయి.  


ఈ పోటీలలో   120 దేశాలకు చెందిన మోడల్స్​ పాల్గొంటారు. వారు   మే   6, 7  న హైదరాబాద్​ చేరుకుంటారు.  దీంతో వారి రాక  సందర్భంగా    చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్,  చౌమొహల్లా  ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్  ఉంటుంది.  వీటి ఏర్పాట్ల కోసం  టూరిజం,  జీహెచ్ఎంసీ, హెరిటేజ్, పోలీస్ ఆఫీసర్లతో  ప్యాలెస్ లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
వెల్కమ్ డిన్నర్ లో తెలంగాణ టూరిజం బ్రాండ్ ఇమేజ్ అనుగుణంగా ఏర్పాట్లను చేయాలని  స్మితా సభర్వాల్  అధికారులకు సూచించారు. 


120 మంది మోడల్స్​ తో పాటు సుమారు 400 మంది ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు  పాల్గొంటారు.  ఈవెంట్​ ప్రారంభం నుంచి చివరి వరకు పర్యాటక ప్రత్యేకతలు చాటేలా కార్యక్రమాలు రూపొందించేలా ఏర్పాట్లు చేయాలని  అధికారులను ఆదేశించారు.


ప్యాలెస్ లో  ఫోటోషూట్ కోసం సీటింగ్ ఏర్పాట్లు, లైవ్ మ్యూజిక్ కాంటెస్ట్, సూఫీ మ్యూజిక్, కవ్వాలీ సంగీత ప్రదర్శన, తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా 20 నిమిషాలు పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు. 
సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం  వెల్కం డిన్నర్ ఉంటుంది.  నిజాం వంటకాలు, తెలంగాణ రుచులు మెన్యూలో ఉంటాయి.  

ఈ సమీక్షలో టూరిజం డైరెక్టర్ హనుమంతు, డైరెక్టర్ యూత్ సర్వీసెస్ డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు,  సెట్విన్ ఎండి వేణుగోపాల్, టూరిజం, పోలీస్, జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.