తిరుమల శ్రీవారికి సీఎం బాబు పుట్టినరోజు విరాళం ₹ 44 లక్షలు విరాళం !

J.SURENDER KUMAR,


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు 75 పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్న ప్రసాద వితరణకు ₹ 44 లక్షలు విరాళంగా అందింది.
భాష్యం విద్యా సంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ  ₹44 లక్షలు విరాళంగా అందించారు.


ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్  బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో  సి.హెచ్.వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించారు.


ఈ సందర్భంగా అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, కర్నూలు భక్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులందరూ రుచి, నాణ్యత అద్భుతంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో  రాజేంద్ర, వీజీవో సురేంద్ర, అన్నప్రసాదాల ప్రత్యేక అధికారి  శాస్త్రీ తదితర అధికారులు పాల్గొన్నారు.